హైదరాబాద్, ఆట ప్రతినిధి: అజీజ్నగర్లోని శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ) సరికొత్త హంగులతో సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలు కల్గిన కృత్రిమ గడ్డితో రూపుదిద్దుకున్న కొత్త టర్ఫ్ను గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇరు తెలుగు రాష్ర్టాల్లో ఇలాంటి తరహా మైదానం ఇదే మొదటిది. యూరోపియన్ టాప్ క్లబ్లుగా కొనసాగుతున్న బార్సిలోనా ఎఫ్సీ, అర్సెనల్ ఎఫ్సీ తమ శిక్షణ కోసం వినియోగించే టర్ఫ్ను ఇది పోలి ఉంటుంది. ఎస్డీఎఫ్సీలో కొత్తగా ఏర్పాటు చేసిన టర్ఫ్ మైదానాన్ని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) అధికారులతో పాటు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) అధ్యక్షు రఫత్ అలీ, కార్యదర్శి ఫాల్గుణ, సునందో ధర్ తదితరులు పరిశీలించారు. ఇలాంటి మైదానాల వల్ల ఫుట్బాల్ను దేశంలో మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లవచ్చని ప్రతినిధులు పేర్కొన్నారు.