భారత మహిళల జట్టు డే/నైట్ టెస్టు ఆడుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని టీమ్ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన తెలిపింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ అమ్మాయిల జట్టు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు పెర్త్లోని వాకా మైదానంలో డే/నైట్ ఆడనుంది. పురుషుల డే-నైట్ టెస్టు మ్యాచ్లు చూస్తున్నప్పుడు, ఏదో ఒకరోజు నేను ఇలాంటి అనుభూతి పొందే సమయం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ప్రస్తుతానికి నేను మాత్రమే అని చెప్పడం తప్పవుతుంది. ఇప్పడు ఆ మధురానుభూతులను భారత జట్టు ఆస్వాదించగలదని మంధాన పేర్కొంది. త్వరలో ఇంగ్లాండ్ టూర్లో భారత్ ఏకైక టెస్టు మ్యాచ్తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఆరేండ్ల తర్వాత మంధాన మొదటి టెస్టు మ్యాచ్ ఆడబోతోంది.