న్యూఢిల్లీ: కరోనా పరీక్షల్లో చెన్నై సూపర్కింగ్స్(సీఎస్కే) బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీకి నెగెటివ్ రాగా, సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్కీపర్ వృద్ధిమాన్ సాహాకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. హస్సీకి నెగెటివ్ రావడంతో ఆస్ట్రేలియా బయల్దేరి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. అయితే ఆదివారం ఆసీస్ బృందంతో కలిసి మాల్దీవుల నుంచి హస్సీ వెళ్తాడా లేక భారత్ నుంచా అన్న దానిపై సందిగ్ధత ఉందని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ శుక్రవారం పేర్కొన్నాడు. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఎంపికైన సీనియర్ వికెట్కీపర్ సాహాకు జరిపిన వేర్వేరు కరోనా పరీక్షల్లో నెగెటివ్, పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు ఐసొలేషన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంగ్లండ్కు వెళ్లే టీమ్ఇండియా కోసం ముంబైలో ఏర్పాటు చేసిన బయోబబుల్లో ఈనెల 25న సాహా చేరే అవకాశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.