(Neeraj Chopra) టోక్యో ఒలింపిక్స్లో బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ధ్యాన్చంద్ ఖేల్ రత్నా అవార్డుకు అన్ని విధాలా అర్హుడని భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా అభిప్రాయపడ్డారు. ఆయనకు ధ్యాన్చంద్ ఖేల్ రత్నా అవార్డు ఇవ్వడం ద్వారా ఆ అవార్డు విలువ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో బంగారు పతకం సాధించడం ద్వారా చరిత్రను రాయడమే కాకుండా దేశ ప్రతిష్ఠను ప్రపంచం దశదిశలా వ్యాపించజేశారని కొనియాడారు.
ఈసారి ధ్యాన్చంద్ ఖేల్ రత్నా కోసం ఆటగాడిని ఎంపిక చేయడం సెలక్షన్ కమిటీకి ఇబ్బందికరంగానే ఉంటుందని, ఈ అవార్డును అందుకోవడానికి ఎందరో సమర్ధ క్రీడాకారులు ముందు వరుసలో ఉన్నారని భైచింగ్ భూటియా మంగళవారం చెప్పారు. ఈసారి పతక విజేతలు ఎక్కువ మంది ఉన్నందున ఈ సమయంలో అవార్డు ఎంపిక పని చాలా కష్టతరం అవుతుందని అన్నారు. అలాకాకుండా టోక్యో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకు ధ్యాన్చంద్ ఖేల్ రత్నా అవార్డును ఇవ్వడం సముచితం అని అభిప్రాయపడుతున్నా అని పేర్కొన్నారు. సాయ్ 55 వ జనరల్ బాడీ మీటింగ్ చాలా మంచి వాతావరణంలో జరిగిందని, పలు విషయాలపై చర్చించినట్లు తెలిపారు. కింది స్థాయిలో ఎక్కువ మంది కోచ్లను ఏర్పాటు చేసే అంశంపై చర్చించామన్నారు.
ప్రజాకేంద్రిత కృత్రిమమేధ వినియోగం పెరగాలి: వెంకయ్యనాయుడు
పాకిస్తాన్లో గరిష్టస్థాయికి నిరుద్యోగం
మైగ్రేన్తో బాధపడుతున్నారా? ఈ ఆహారాలను దూరం పెట్టండి!
హోం మంత్రి అనిల్ విజ్కు అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్లో చేరిక
కృత్రిమ కాఫీ.. ఇక కాఫీ తోటలతో పనిలేదు!
మరో 3 రోజుల్లో దుబాయ్ ఎక్స్పో
విజృంభిస్తున్న డెంగ్యూ డీ2 వేరియింట్.. అరికట్టండిలా!
క్రీడలతో పిల్లల్లో డిప్రెషన్కు చెక్.. మాంట్రియల్ పరిశోధన
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్పై మరోసారి దాడి
అనుకోకుండా ఆవిష్కృతమైన యాంటీబయోటిక్స్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..