న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో భారత్కు తొలి అథ్లెటిక్స్ స్వర్ణాన్ని అందించి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన జావెలిన్ త్రో ప్రపంచ ర్యాంకింగ్స్లో నీరజ్.. రెండో స్థానానికి దూసుకెళ్లాడు. ఒలింపిక్స్కు ముందు 16వ ర్యాంకులో ఉన్న నీరజ్.. టోక్యో ప్రదర్శన అనంతరం 1315 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో జర్మన్ జావెలిన్ త్రోయర్ జోహాన్స్ వెట్టర్ (1396 పాయింట్లు) టాప్ ర్యాంక్లో ఉన్నాడు. పోలండ్ త్రోయర్ మార్సిన్ క్రుకోస్కి, టోక్యోలో కాంస్య పతకం సాధించిన జాకబ్ (చెక్ రిపబ్లిక్), జులియన్ వెబర్లు (జర్మనీ) వరుసగా 3,4,5 ర్యాంక్ల్లో ఉన్నారు.