ప్రస్తుతం దేశమంతా నీరజ్ చోప్రా గురించే మాట్లాడుకుంటోంది. అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొట్టమొదటి ఇండియన్గా చరిత్రకెక్కాడు. జావెలిన్ త్రోలో 87.58 మీటర్ల దూరం త్రో చేసి రికార్డు క్రియేట్ చేశాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. రెండో రౌండ్లోనే బెస్ట్ త్రో చేసి.. శెభాష్ అనిపించుకున్నాడు. చాలా ఏళ్ల నుంచి ఒలింపిక్ గేమ్స్లో కొద్దిలో గోల్డ్ మెడల్ను మిస్ చేసుకున్న ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్, పీటీ ఉష, అంజు బాబీ జార్జ్ లాంటి అథ్లెట్లను ఈసందర్భంగా దేశమంతా ఓసారి గుర్తు చేసుకుంది. అథ్లెట్లకు అందని కలగా ఉన్న గోల్డ్ మెడల్ను సాధించి భారతదేశ సత్తాను ప్రపంచానికి తెలియజేశాడు నీరజ్ చోప్రా.
అయితే.. గోల్డ్ మెడల్ గెలిచిన అనంతరం మాట్లాడిన నీరజ్ చోప్రా.. తన గోల్డ్ మెడల్ను మిల్కా సింగ్కు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. నేను ఈ మెడల్ను మిల్కా సింగ్కు అంకితం ఇస్తున్నా. ఆయన ఎక్కడ ఉన్నా. నన్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని నేను భావిస్తున్నా. అథ్లెటిక్స్లో భారత్.. గోల్డ్ మెడల్ గెలవడం ఇదే తొలిసారి. కాబట్టి నాకే కాదు.. యావత్ భారతదేశమంతా గర్వించదగ్గ విషయం ఇది.. అని నీరజ్ చోప్రా తెలిపారు.