నవీపేట, సెప్టెంబర్ 21: ఆలిండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు నవీపేట సర్పంచ్, నిజామాబాద్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్ ఎంపికయ్యారు. గోవాలోని పారికర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్డ్రాకు తాను ఎంపికైనట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ టోర్నీలో విజేత, రన్నరప్గా నిలిచే ప్లేయర్లు స్పెయిన్లో జరిగే టోర్నీలో బరిలోకి దిగుతారని ఆయన తెలిపారు.