ముంబై: టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ప్లేయర్ నవ్దీప్ సైనీ తన కొత్త హార్లీ డేవిడ్సన్ బైక్ను అభిమానులకు చూపించాడు. షర్ట్ లేకుండా తాను ఆ బైక్ కూర్చున్న వీడియోను అతడు ట్విటర్లో షేర్ చేశాడు. భయమంటే ఏంటో తెలుసుకోవడానికి నాతో నా బైక్పై రండి అని అతడు కామెంట్ చేశాడు. ఈ వీడియో వైరల్గా మారిపోయింది. మూడు లక్షలకుపైగా వ్యూస్తోపాటు 18 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. గతేడాది ఆస్ట్రేలియా టూర్లో అంచనాలకు మించి రాణించిన సైనీ.. ఈ ఏడాది ఐపీఎల్లో మాత్రం ఆర్సీబీ తరఫున కేవలం ఒక మ్యాచ్ ఆడాడు. అంతకుముందు 13 ఐపీఎల్ మ్యాచ్లలో 6 వికెట్లు తీసుకున్నాడు.