అగర్తలా: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా వివిధ స్థాయిల విద్యార్థులకు పరీక్షల నిర్వహణ సాధ్యం కాలేదు. దాంతో తెలంగాణ సహా చాలా రాష్ట్రాలు ఇప్పటికే 10, 12 తరగతుల పరీక్షలను రద్దు చేశాయి. అటు జాతీయ విద్యాసంస్థల్లో కూడా 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను కేంద్రం రద్దు చేసింది. తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.
అయితే, 10, 12 తరగతులకు చెందిన ఏ విద్యార్థి అయినా పరీక్షల ఫలితాలతో సంతృప్తి చెందకపోతే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని త్రిపుర విద్యాశాఖ మంత్రి రతన్లాల్ నాథ్ తెలిపారు.