మంచిర్యాల : సమిష్టి కృషితోనే పట్టణాభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 4వ రోజు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని 17 ,18 వార్డులలో ఇంటింటికీ 6 మొక్కలను పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ భారతీ హోలీకేరి, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మితో సుమన్ ప్రారంభించిమొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రూ.80 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గణాంకాలతో వివరించారు.
70 ఏండ్లుగా నాయకులందరూ పదవులు అనుభవించారని, ప్రజల బాగోగులు విస్మరించారని దుయ్య బట్టారు. తాము కష్టపడి నిధులు తీసుకొస్తున్నామని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా తీసుకొని పనులు పూర్తిచేయింవాలని కోరారు. బంగారు చెన్నూర్గా మార్చేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన గిల్డా, కమిషనర్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, కో అప్షన్ మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి