ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్
ఉట్నూర్, ఇంద్రవెల్లిలో డీపీవో శ్రీనివాస్తో కలిసి పర్యటన
ఉట్నూర్, జూన్ 24: పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల ని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలో పారిశు ధ్యం, ప్రకృతి వనాల నిర్వహణను గురువారం పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. ఉట్నూర్లో పారిశుధ్య పనుల తీరును అభినందించారు. డీపీవో శ్రీనివాస్, డివిజ న్ పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్, ఎంపీపీ పంద్ర జైవంత్రా వు, ఎంపీడీవో తిరుమల, జీపీ ప్రత్యేకాధికారి మహేశ్, ఈవో సత్యనారాయణ, ఈజీఎస్ ఏపీవో రజినీకాంత్, జీపీ సి బ్బంది తదితరులున్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 24: పల్లె ప్రగతిలో భాగంగా గ్రా మా ల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాల్లో అందరికీ భాగస్వా మ్యం కల్పించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ పరిధిలో గురువారం డీపీవో శ్రీనివాస్తో కలిసి ఆయన పర్యటించా రు. పల్లె ప్రగతి, పారిశుధ్య పనులు, నర్సరీలు, మొక్కలు, పల్లె ప్రకృతి వనాలను పరిశీలించారు. మండల కేంద్రంలోని వార్డులతోపాటు ప్రధానరోడ్డుపై చెత్తాచెదారం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఇంద్రవెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కోరెంగా గాంధారి అధ్యక్షతన మండల ప్రజాప్రతినిధులు, ఆయా శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు స్థానికంగా నే నివాసం ఉండాలని సూచించారు. వ్యాపారులు చెత్తను బయట పారేయకుండా చూడాలన్నారు. విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ రుణాలను రెగ్యులర్గా కట్టాలని సూచించారు. డీఎల్పీవో భిక్షపతిగౌడ్, ఎంపీడీవో పుష్పలత, ఎంపీపీ పోటే శో భాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, జడ్పీ కోఆప్షన్ స భ్యుడు ఎంఏ అమ్జద్, ఉపసర్పంచ్ గణేశ్ తైహిరే, ఎంపీటీసీ ఆశాబాయి, ఈవో శ్రీనివాస్రెడ్డి, ఏపీవో సంతోష్జైస్వాల్, ఈసీ జాదవ్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
పహాణీలు ఇవ్వాలని వినతి
తాము సాగు చేస్తున్న భూములకు సంబంధించి పహాణీలు ఇవ్వాలని కోరుతూ దళిత రైతులు సూర్యకాంత్, పీరాజీ, కొండిబా, గోపీనాథ్, రాందాస్ అదనపు కలెక్టర్ డే విడ్కు వినతిపత్రం అందించారు. ఆ భూములకు తమకు హక్కులు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
మొక్కలు సిద్ధం చేయాలి
ఉట్నూర్ రూరల్, జూన్ 24: హరితహారం ప్రారంభాని కి ముందే మొక్కలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. మండలంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఉపాధి నిధులతో ఏర్పాటు చేసిన నర్స రీ, పల్లె ప్రకృతి వనం, ఎవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను గు రువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు త్వరగా పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రతీ హాబిటేషన్లో పల్లె ప్ర కృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, సర్పంచ్ పంద్ర లత, ఎంపీడీవో తిరుమల, ఎంపీవో మహేశ్, ఈజీఎస్ ఏపీ వో రజినీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.