పన్ను రాబడితో మరింత అభివృద్ధి
మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి
బడ్జెట్లో10శాతం హరితహారానికి ఉపయోగించాలి: అదనపు కలెక్టర్ మనూచౌదరిర్సన్ కల్పనాభాస్కర్గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బడ్జె ట్ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్యే, అదనపు కలెక్టర్ మనూచౌదరి హాజరయ్యారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 23కోట్ల 65 లక్షల 80వేల అంచనా వ్య యంతో రూపొందించిన బడ్జెట్ను సమావేశంలో ఆమోదించారు. ఈ సందర్భంగా చై ర్పర్సన్ కల్పన మాట్లాడుతూ సభ్యులు స హకారం అందిస్తే పనులు వేగవంతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్లో ఆస్తిపన్ను రూపంలో రూ.2కోట్ల 40లక్షలు, నా న్టాక్స్లో దుకాణాల అద్దె, కుళాయి చార్జీలు రూ.3కోట్ల 77లక్షలు, డిపాజిట్లు రూ.9 లక్షలు, గ్రాంట్లు రూ.16 కోట్ల 96లక్షల వ్య యంగా అంచనా వేశామన్నారు. ఈమేరకు బడ్జెట్కు సమావేశంలో ఆమోదం లభించిం ది.
ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడు తూ మున్సిపాలిటీలో ప నులు త్వరగా పూ ర్తయ్యేలా చూడాలన్నా రు. పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతోపాటు సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి వార్డుకో పార్కు ఏర్పాటు చేసి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. ప్రభుత్వంతోపాటు ఆస్తిపన్ను రూపంలో అధికంగా నిధులు పొంది మున్సిపాలిటీని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలన్నారు. మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. అదనపు కలెక్టర్ మనూచౌదరి మాట్లాడుతూ మున్సిపల్ బడ్జె ట్ ప్రతిపాదనలో 10శాతం హరితహారానికి ఉపయోగించాలన్నారు. డంపింగ్యార్డు, నర్సరీల నిర్వహణ వైకుంఠధామాల ఏర్పాట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స మావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, వైస్చైర్మన్ బాబురావు, కౌన్సిలర్లు ఉన్నారు.