హైదరాబాద్, ఆట ప్రతినిధి: నైరోబి (కెన్యా) వేదికగా జరిగే అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ కోసం సన్నాహకాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఎన్ఐఎస్ పటియాల వేదికగా ఈనెల 23 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే సన్నాహక శిబిరానికి శుక్రవారం ప్లేయర్లను ఎంపిక చేశారు. గత కొన్ని టోర్నీ ల్లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యువ అథ్లెట్లు అగసర నం దిని, జివాంజీ దీప్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.