ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా
నియంత్రణకు అధికార యంత్రాంగం
రంగంలోకి దిగింది.. ప్రత్యేక వైద్య
కార్పొరేషన్, మే 8: బృందాలతో చేపట్టిన జ్వర సర్వే నగరంలో జోరుగా సాగుతున్నది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి నగరవాసుల ఆరోగ్య వివరాలు నమోదు చేసున్నారు. స్వల్ప లక్షణాలు ఉన్నవారికి ఐసొలేషన్ కిట్లు అందజేస్తూ, జాగ్రత్తలను వివరిస్తూ ముందుకుసాగుతున్నారు.
కార్పొరేషన్, మే 8: రాష్ట్ర ప్రభుత్వం కరోనా సెకం డ్ వేవ్ కట్టడి కోసం చేపట్టిన జ్వర సర్వే నగరంలో శనివారం చురుగ్గా సాగింది. 60 డివిజన్లల్లోనూ ఈకార్యక్రమాన్ని చేపట్టారు. వైద్య సిబ్బందితో పాటు, నగరపాలక సిబ్బంది ఇంటింటికీ ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సమస్య లున్న వారికి వెంటనే సంబంధిత వైద్యులతో వివరాలు అందించి చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం ఉంటే వెంటనే హోం ఐసోలేషన్ కిట్ ను అందిస్తున్నారు. దీంతో పాటు ఐసోలేషన్లో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ప్రతి డివిజన్లోని అన్ని ఇళ్లల్లోని వేగంగా సర్వేను పూర్తి చేసే దిశగా అధికారు లు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతి రోజు కనీసం వంద ఇళ్లను సర్వే చేసి వివరాలను నమోదు చేసుకుంటున్నారు.
అన్ని డివిజన్లలో..
నగరంలోని 60 డివిజన్లల్లోనూ ఈ సర్వే సాగుతున్నది. ప్రతి డివిజన్కు వైద్య సిబ్బంది, అంగన్వా డీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. కార్పొరేటర్లు వీరికి సహకరిస్తున్నారు. సిబ్బందికి తగిన సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఉన్న వివరాలు అందిస్తే సత్వరమే వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లోగా ఈ సర్వేను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్ల వారిగా ఎప్పటికప్పుడు సమాచారం ఉన్నతాధికారులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రోజు వారిగా వివరాలను నమోదు చేసుకొవడంతో పాటుగా కరోనా బాధితుల వివరాలను నమోదు చేసి వా రికి అన్ని విధాలుగా సహకారం అందించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు.
పూర్తి వివరాలు నమోదు చేయాలి..
నగరంలో ఇంటింటికీ సర్వే చేపడుతున్నప్పుడు పూర్తి వివరాలను నమోదు చేయాలని నగర కమిషనర్ క్రాంతి ఆదేశించారు. శనివారం నగరంలో సాగుతున్న సర్వేను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటిని సర్వే చేయాలని, లక్షణాలు ఉన్న వారికి వెంటనే ఐసోలేషన్ కిట్ను అందించాలని పేర్కొన్నారు. ప్రతి రోజు వంద ఇళ్లకు తగ్గకుండా సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.