చెన్నై: శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ సోమవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. హృదయ సంబంధ సమస్యతో దవాఖానలో చేరిన మురళీధరన్కు వైద్యులు కరోనరీ అంజియోప్లాస్టీ నిర్వహించారు. ‘మురళీకి స్టెంట్లతో శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. అతనికి ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు’ అని దవాఖాన వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ తర్వాత 49 ఏండ్ల మురళీధరన్ తిరిగి జట్టుతో కలుస్తాడని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తెలిపింది. 2015 నుంచి హైదరాబాద్ జట్టుకు మురళీధరన్ స్పిన్ బౌలింగ్ కోచ్తో పాటు మెంటార్గా వ్యవహరిస్తున్నాడు.