చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కళ్లుచెదిరే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మిశ్రా వేసిన 9వ ఓవర్ రెండో బంతిని ఫోర్ బాదిన రోహిత్(44) నాలుగో బంతిని భారీ షాట్ ఆడబోయి లాంగాన్లో స్టీవ్ స్మిత్ చేతికి చిక్కాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పాండ్య(0) ఆఖరి బంతిని కూడా రోహిత్ లాగే షాట్ ఆడటంతో లాంగాన్లో మళ్లీ స్మిత్ చేతికే చిక్కి పెవిలియన్ చేరాడు.
దీంతో ముంబై 3 బంతుల్లో 2 వికెట్లు కోల్పోయింది. లలిత్ యాదవ్ వేసిన 11వ ఓవర్లో కృనాల్ పాండ్య బంతిని వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. దీంతో ముంబై భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై 5 వికెట్లకు 82 పరుగులు చేసింది. ప్రస్తుతం పొలార్డ్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు.