ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మరికాసేపట్లో ఆసక్తికర సమరం జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని
చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన ముంబై సారథి రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఇరుజట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది. లీగ్లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్లు ఆడిన చెన్నై ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఆరు మ్యాచ్లు ఆడి మూడింట్లో మాత్రమే గెలుపొందింది.