న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపీఎల్ ( IPL 2021 ) రెండవ ఎడిషన్ దుబాయ్లో జరగనున్న విషయం తెలిసిందే. కొన్ని జట్లు ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ కొందరు అబుదాబి చేరుకున్నారు. అయితే వాళ్లు ఆరు రోజుల పాటు హోటల్ క్వారెంటైన్లో ఉండన్నారు. వారి కదలికపై నిఘా పెట్టేందుకు అబూ దాబి ఆ జట్టు ప్లేయర్లకు జీపీఎస్ వాచీలను ఇచ్చింది. ఆ వాచీల ద్వారా ప్లేయర్ల కదలికలను పసికట్టనున్నారు. క్వారెంటైన్ సమయంలో ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారో లేదో తెలుస్తుంది. అబుదాబిలో క్వారెంటైన్ రూల్స్ కఠినంగా ఉన్నాయి. ఒకవేళ దుబాయ్ నుంచి అబుదాబిలో ఎంటర్ కావాలన్న.. వాళ్లు కోవిడ్ నెగటివ్ రిపోర్ట్ చూపించాల్సిందే. మరోవైపు దుబాయ్ హోటల్లో బస చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం జీపీఎస్ వాచీలను ఇవ్వలేదు. క్వారెంటైన్ సమయంలో ప్రతి రోజు ఆటగాళ్లకు కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 19న దుబాయ్లో చెన్నై, ముంబై మ్యాచ్లో 14వ ఐపీఎల్ రెండవ ఎడిషన్ ప్రారంభంకానున్నది.