రాంచీ : ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తల్లిదండ్రులు దేవకీ దేవి, పాన్సింగ్లు కరోనా నుంచి కోలుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వీరు.. నిన్న రాత్రి డిశ్చార్జి అయ్యారు. కరోనా నుంచి దేవి, పాన్సింగ్లు పూర్తిగా కోలుకున్నారని, వారికి ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు అని వైద్యులు తెలిపారు.
ఈ నెల 20న ధోనీ పేరెంట్స్కు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రాంచీలోని పూలే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వారికి ఆక్సిజన్ లెవల్స్ స్థిరంగా ఉన్నాయని ఏప్రిల్ 21న వైద్యులు వెల్లడించారు. ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా ఉన్న ధోనీ ప్రస్తుతం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే.