ములుగు : వనదేవతలు మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు జూపల్లి రాజశేఖర్ (26) అనే యువకుడు జంపన్నవాగులో గల్లంతైన సంఘటన జిల్లాలోని త్వాడాయి మండలం మేడారంలో సోమవారం చోటుచేసుకుంది.
రాజశేఖర్ బంధువుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని మల్కాజ్గిరికి చెందిన రాజశేఖర్ వాటర్ప్లాంట్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన మేనత్త, బంధువులతో కలిసి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం సాయంత్రం మేడారానికి వచ్చారు. ఉదయం హోలీ ఆడుకున్న అనంతరం అమ్మవార్ల దర్శనానికి వెళ్లేందుకు అందరూ కలిసి స్నానాలు చేసేందుకు జంటవంతెనలకు ఎడమ వైపున గల చెక్డ్యాం వద్దకు వెళ్లారు.
లోతు అంచనా వేయకుండా రాజశేఖర్ నీటిలోకి దిగడంతో మునిగిపోయాడు. బంధువులు ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో పోలీసుస్టేషన్కు సమాచారం అందించారు. పోలీసులు, మేడారం వీఆర్వో సమ్మయ్య స్థానిక జాలర్లతో గాలింపు చేపట్టారు. అయినా రాజశేఖర్ ఆచూకీ లభించలేదు. రాజశేఖర్కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. వచ్చే మే నెలలో పెండ్లి ఉంది. ఇంతలోనే మృత్యువాత పడడంతో బంధువులు రోదిస్తున్నారు.