ఏ వ్యాపారంలోనైనా పోటీ సహజం. బ్యాంకింగ్ రంగంలో త్రైమాసిక ముగింపు లేదా ఆర్థిక సంవత్సరం ముగింపు సమయాల్లో డిపాజిట్ల కోసం బ్యాంకులు వినియోగదారుల ఎరవేయడం సహజం. అవకాశం వస్తే డిపాజిట్లు పెరగడానికి ప్రచారాన్ని అధికం చేస్తాయి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఇమ్యూన్ ఇండియా డిపాజిట్ స్కీవ్ు పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ను ప్రకటించింది. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారందరికీ ఈ స్కీము అర్హత అంటూ ప్రకటించింది. ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్ల మీద 0.25 శాతం అదనపు వడ్డీని పొందుతున్న సీనియర్ సిటిజన్లకు మరింత అదనపు వడ్డీని చెల్లించనున్నట్టు తెలిపింది. ఈ వినూత్న డిపాజిట్ స్కీమ్ 1111 రోజులకు అంటే దాదాపు మూడేండ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 0.25 శాతం అదనపు వడ్డీని చెల్లించనున్నట్టు ప్రకటించింది. వాక్సినేషన్ను ప్రోత్సహించడానికే ఈ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్టు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.