దుబాయ్: ఈ యేటి ఐపీఎల్ రెండవ సెషన్ దుబాయ్లో ఆదివారం నుంచి స్టార్ట్ కానున్న విషయం తెలిసిందే. దీని కోసం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. నెట్స్లో భారీ షాట్లతో తన బ్యాటింగ్ స్కిల్స్ను ప్రదర్శిస్తున్నాడు. తొలి హాఫ్లో పెద్దగా రాణించలేకపోయిన ధోనీ.. సెకండ్ హాఫ్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రైనింగ్ సెషన్లో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు. ధోనీ శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను సీఎస్కే తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ధోనీ గత ఏడు ఐపీఎల్ మ్యాచుల్లో కేవలం 37 రన్స్ మాత్రమే చేశాడు. ప్రస్తుతం ట్రైనింగ్ చేస్తూంటే అతను సెకండ్ పార్ట్లో తన సత్తా చాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెవరేట్ హెలికాప్టర్ షాట్తోనూ ధోనీ ఆకట్టుకున్నాడు. మాజీ బౌలింగ్ కోచ్ ఎరిక్ సిమ్మన్స్ అంపైరింగ్ చేస్తుంటే ధోనీ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఎరిటాన్మెంట్ అని పోస్టు చేసిన వీడియోకు గంటల్లో వేల లైక్లు వచ్చేశాయి. ఈ ఆదివారం ముంబై, చెన్నై మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనున్నది.