న్యూఢిల్లీ: ఐపీఎల్ తప్ప మరో కాంపిటిటివ్ క్రికెట్లో ఆడటం లేని ధోనీ ప్రస్తుతం తన టైమంతా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. అయితే ధోనీలాంటి క్రికెటర్లు ఆడినా ఆడకపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. పైన ఉన్న ఫొటో చూశారు కదా. ఈ కొత్త లుక్కే ధోనీని మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి షిమ్లా వెళ్లిన ధోనీ ఈ కొత్త లుక్లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. పెద్ద పెద్ద మీసాలతో అతడు పూర్తి డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. పైగా అక్కడి సాంప్రదాయ టోపీ పెట్టుకొని కనిపించడంతో ఆ ఫొటో మరింత వైరల్ అయింది. అతడు మీసాలతో కనిపించిన ఫొటోలను మిస్టర్ కూల్ అభిమానులు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.