నితిన్ కథానాయకుడిగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మాస్ట్రో’. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఎన్.సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. నభానటేష్ కథానాయిక. తమన్నా కీలక పాత్రను పోషిస్తోంది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైన ఆఖరి షెడ్యూల్లో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అదివారం నాటితో షూటింగ్ పూర్తయింది. అంధుడిగా నటించే ఓ పియానో ప్లేయర్ కథ ఇది. కొన్ని అనూహ్య సంఘటనలు అతడి జీవితాన్ని ఏ విధమైన మలుపులు తిప్పాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం’ అని తెలిపారు. నరేష్, జిషుసేన్గుప్తా, అనన్య, హర్షవర్ధన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, ఛాయాగ్రహణం: జె. యువరాజ్.