ఎంపీపీల ఫోరం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా హరికృష్ణ
మెదక్, మార్చి 24 : ఎంపీపీల సమస్యల పరిష్కారంలో ముందుండి పోరాడుతానని నూతనంగా ఎన్నికైన ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కల్లూరి హరికృష్ణ అన్నారు. బుధవారం మెదక్లోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో ఎంపీపీల ఫోరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని ఎంపీపీలు తనను ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నియమించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ బడ్జెట్లో మండల పరిషత్లకు నిధులు కేటాయించడం పై సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీపీల ఫోరం జిల్లా నూతన కార్యవర్గం…
ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, గౌరవాధ్యక్షుడిగా హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జంగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్యాదవ్, శ్రీనివాస్, ఆవుల భాగ్యలక్ష్మి, సంయుక్త కార్యదర్శిగా దేశెట్టి సిద్ధిరాములు, ప్రచార కార్యదర్శిగా యమునజయరాంరెడ్డి, కార్యదర్శులుగా సబిత, దలావత్ రాజు, చింత స్వప్న, కోశాధికారిగా స్వరూపానరేందర్రెడ్డి, సలహాదారులుగా ఈర్ల అనిల్కుమార్రెడ్డి, పుల్లన్నగారి చందనప్రశాంత్రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా పురం నవనీతరవి, వినోదాదుర్గారెడ్డి, మంజులకాశీనాథ్, భిక్షపతి, సరోజనసాయిలు ఎన్నికయ్యారు. ఎన్నికల పర్యవేక్షకులుగా, ఇన్చార్జిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దొంతి చంద్రాగౌడ్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ, గౌరవ అధ్యక్షుడు శేరి నారాయణరెడ్డిలను ఎంపీపీలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జిల్లాలోని ఆయా మండలాల ఎంపీపీలు పాల్గొన్నారు.
ఎంపీపీ శేరి నారాయణరెడ్డి సన్మానం
హవేళిఘనపూర్, మార్చి 24: జిల్లా ఎంపీపీల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా హవేళిఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి ఎన్నికైనందున మండల పరిధిలోని మద్దుల్వాయి మాజీ సర్పంచ్ కిరణ్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. నారాయణరెడ్డి ఎంపిక పై మండల సర్పంచ్లు రాజేందర్రెడ్డి, దేవాగౌడ్, మహిపాల్రెడ్డి, యా మిరెడ్డితో పాటు మండలంలోని ఆయా గ్రామా ల సర్పంచ్లు, ఎంపీటీసీలు అభినందించారు.
చేగుంటలో ఘన సన్మానం…
చేగుంట:మార్చి24: జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు హరికృష్ణ,జిల్లా ఉపాధ్యక్షుడు మాసుల శ్రీనివాస్ను చేగుంటలో సన్మానించారు. చేగుంటకు వచ్చిన జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ,ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ను,జిల్లా మెడికల్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రాజు ఘనంగా సత్కరించి అభినంధనలు తెలిపారు.