ముంబై: బ్యాటింగ్, కెప్టెన్సీ, వికెట్ కీపింగ్ ఈ మూడు పాత్రలను అత్యుత్తమంగా నిర్వర్తించిన ఆటగాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఈ మూడు విభాగాల్లో రాణించి అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన కెప్టెన్ కూల్ మహీ తాజాగా మరో అరుదైన రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో 150 మందిని ఔట్ చేసిన తొలి వికెట్ కీపర్గా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ
సరికొత్త రికార్డు సృష్టించారు. ఐపీఎల్ 2021లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్కతా
నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ధోనీ ఈ ఫీట్ అందుకున్నాడు. నితీశ్ రాణా క్యాచ్ అందుకోవడం ద్వారా మైలురాయి చేరుకున్నాడు. లీగ్లో ధోనీ ఇప్పటి వరకు 111 క్యాచ్లు అందుకోగా.. 39 స్టంపౌట్లు చేశాడు.
వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోనీ క్షణాల్లో స్టంపింగ్లు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ధోనీ తర్వాత కోల్కతా మాజీ కెప్టెన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. దినేశ్ ఇప్పటి వరకు 112 క్యాచ్లు, 31 స్టంపింగ్లు చేశాడు.