వరంగల్ అర్బన్ : ఎవరికి ఓటు వేస్తే ఇక్కడి పేదల సంక్షేమానికి ఉపయోగపడుతుందో ఆలోచించి ఓటు వేయా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 44వ డివిజన్, అల్లిపురంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంకణాల శ్రీదేవికి మద్దతుగా మంత్రి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రమేష్ ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన అభ్యర్థి శ్రీదేవిని నిండు మనసుతో ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో పెన్షన్ కావాలంటే ఉన్నవాళ్లలో ఒకరు చనిపోతే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అర్హులందరికీ పెన్షన్లు 2000 ఇస్తున్నారని మంత్రి తెలిపారు.
అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసిఆర్ అన్నారు.
ఎన్నికలు రాగానే బీజేపీ, కాంగ్రెస్ లు వస్తాయి. కానీ ఎన్నికలు జరిగిన ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు అయినా వచ్చారా? అని ప్రశ్నించాలన్నారు.
మతతత్వ రాజకీయాలకు ఆజ్యం పోసే బీజేపీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.
ఎళ్ల వేళలా మీకు అందుబాటులో ఉండి మీ సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకునే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.