పుణె: భారత్తో జరిగిన తొలి వన్డేలో గాయపడ్డ ఇంగ్లండ్ కెప్టెన్ ఇయార్ మోర్గన్.. మిగితా రెండు వన్డేలకు దూరం కానున్నాడు. గాయం నుంచి కోలుకోని కారణంగా .. అతను వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. చివరి రెండు వన్డేలకు ఇంగ్లండ్ సారథ్య బాధ్యతలను జోస్ బట్లర్ నిర్వర్తించనున్నాడు. తొలి వన్డేలోనే గాయపడ్డ సామ్ బిల్లింగ్స్ మాత్రం రెండవ వన్డేకు దూరంకానున్నాడు. అయితే అతను మూడవ వన్డేకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ జరిగే రెండవ వన్డేలో ఇంగ్లండ్ తరపున లియామ్ లివింగ్స్టోన్ అరంగేట్రం చేయనున్నాడు. గురువారం జరిగిన ఫీల్డింగ్లో డ్రిల్లో మోర్గాన్ పాల్గొన్న.. వన్డే సిరీస్కు మాత్రం అందుబాటులో ఉండడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. మోర్గన్ స్థానంలో డేవిడ్ మలాన్ తుది జట్టులో చోటు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.