చెన్నై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 205 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్రైడర్స్ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయింది. వేగంగా పరుగులు సాధించాలనే తాపత్రయంతో వికెట్లను పారేసుకున్నారు. ఓపెనర్ శుభ్మన్ గిల్(21: 9 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) దూకుడుగా ఆడే క్రమంలో జేమీసన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.
ఆ తర్వాత వన్డౌన్లో వచ్చిన రాహుల్ త్రిపాఠి(25)ని వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ పంపాడు. పవర్ప్లే ఆఖరికి కోల్కతా 57/2తో నిలిచింది. చాహల్ వేసిన ఏడో ఓవర్లో రెండు ఫోర్లు బాదిన నితీశ్ రాణా(18) ఐదో బంతికి ఔటయ్యాడు. 7 ఓవర్లకు కోల్కతా 3 వికెట్లకు 67 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2), దినేశ్ కార్తీక్(0) క్రీజులో ఉన్నారు.