టీ20 ప్రపంచకప్పై నిర్ణయానికి గడువు కోరనున్న బీసీసీఐ
నేడు ఐసీసీ బోర్డు సమావేశం
న్యూఢిల్లీ: భారత్లో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని బీసీసీఐ మరో నెల గడువు కోరనుంది. దేశంలో కరోనా పరిస్థితులు మారుతుండడంతో మరింత గడువు ఇవ్వాలని మంగళవారం జరుగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో అడగనుంది. ప్రపంచకప్తో పాటు పన్ను మినహాయింపు, 2023-31 ఎఫ్టీపీ ప్రణాళిక, మరిన్ని దేశాలకు క్రికెట్ విస్తరణ తదితర అంశాలపై వర్చువల్గా సాగే ఐసీసీ బోర్డు సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. బీసీసీఐ తరఫున అధ్యక్షుడు గంగూలీ వ్యక్తిగతంగా హాజరవుతాడని తొలుత అనుకున్నా.. అతడు కూడా వర్చువల్గానే సమావేశంలో పాల్గొననున్నాడు. అయితే పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు, మెగాటోర్నీకి ఐసీసీకి పన్ను మినహాయింపుపైనా చర్చ జరుగనుంది. కాగా ఐపీఎల్ 14వ సీజన్లో మిగిలిన మ్యాచ్లను సెప్టెంబర్ – అక్టోబర్ మధ్య యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ని ర్ణయించిన సంగతి తెలిసిందే.
ఎఫ్టీపీ, క్రికెట్ విస్తరణపై..
2023-2031 మధ్య ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ టోర్నీలు ఎలా ఉండాలన్న భవిష్యత్ పర్యటనల కార్యాచరణ (ఎఫ్టీపీ)పైనా ఐసీసీ బోర్డులో చర్చ జరనుగనుంది. అలాగే ప్రపంచంలోని మరిన్ని దేశాలకు క్రికెట్ను ఎలా విస్తరించాలన్న ప్రణాళికపై సభ్యులు సమాలోచనలు చేయనున్నారు.