బళ్లారి(కర్నాటక): జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో హుసాముద్దీన్ 5-0తేడాతో సాహిల్(చత్తీస్గఢ్)పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హుసాముద్దీన్..ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించాడు. ఆదివారం జరిగే క్వార్టర్స్ పోరులో మహారాష్ట్రకు చెందిన రుషికేశ్ గౌడ్తో హుసామ్ తలపడుతాడు.