లక్నో: భారత దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్ రికార్డుల కిరీటంలో మరో కలికితురాయి చేరింది. మహిళల వన్డే క్రికెట్లో 7 వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో నాలుగో వన్డేలో మిథాలీ ఈ అరుదైన మైలురాయి చేరింది. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఎడ్వర్డ్స్ (5,992 పరుగులు) మిథాలీ తర్వాతి స్థానంలో ఉండగా.. మరెవరూ ఆమె దరిదాపుల్లో లేరు. మహిళల క్రికెట్లో 10 వేల అంతర్జాతీయ పరుగులు చేసిన రెండో ప్లేయర్గా, తొలి భారత క్రీడాకారిణిగా మిథాలీ ఇటీవల చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ సఫారీల సొంతమైంది. పూనమ్ రౌత్ (104) సెంచరీ