ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. 2021 టీ20 వరల్డ్ కప్కు ముందు.. మిస్సా ఉల్ హక్, వకార్ యూనిస్లు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పాక్ క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న మిస్సా, బౌలింగ్ కోచ్గా ఉన్న వకార్ యూనిస్లు .. ఆ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల విండీస్ వెళ్లిన పాక్ జట్టుకు హెడ్ కోచ్గా మిస్బా వ్యవహరించారు. ఆ సమయంలో అతనికి కోవిడ్ వైరస్ సోకింది. దీంతో అతను జమైకాలో క్వారెంటైన్లో ఉన్నారు. ఆ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకుని రాజీనామా చేస్తున్నట్లు మిస్బా తెలిపాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని చెప్పింది. మిస్బా బాటలోనే తాను కూడా నడవనున్నట్లు వకార్ యూనిస్ తెలిపారు. ఇద్దరం కలిసి కోచింగ్ బాధ్యతలు చేపట్టామని, ఇప్పుడు ఇద్దరం రాజీనామా చేస్తున్నట్లు వకార్ తెలిపారు. న్యూజిలాండ్తో జరిగే సిరీస్లకు తాత్కాలిక కోచ్లుగా సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్లను నియమించినట్లు పీసీబీ తన ప్రకటనలో తెలిపింది.