టోక్యో: ఒలింపిక్స్లో ఇండియాకు తొలి మెడల్ అందించిన మీరాబాయి చానుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 49 కేజీల వెయిట్లిఫ్టింగ్ విభాగంలో ఆమె సిల్వర్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో చైనా వెయిట్లిఫ్టర్ ఝిహుయి హౌ గోల్డ్ గెలిచింది. కానీ ఆమెకు యాంటీ డోపింగ్ అధికారులు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసమే ఆమెను టోక్యోలోనే ఉండాల్సిందిగా ఇప్పటికే ఆదేశించారు. ఒకవేళ ఆమె డోప్ టెస్ట్లో విఫలమైతే మాత్రం రెండోస్థానంలో ఉన్న మీరాబాయికి ఆ గోల్డ్ మెడల్ దక్కుతుంది.
ఈ ఈవెంట్లో చాను మొత్తం 202 కేజీల బరువు ఎత్తగా.. హౌ 210 కేజీలు ఎత్తి గోల్డ్ గెలిచింది. ఇండోనేషియా వెయిట్లిఫ్టర్ ఐసా విండీ కాంటికా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఇప్పటికే మీరాబాయి ఇండియాకు తిరుగు ప్రయాణమైంది. సోమవారం ఉదయం ఇండియా ఫ్లైటెక్కే ముందు ఎయిర్పోర్ట్లో కోచ్తో దిగిన ఫొటోను ఆమె ట్విటర్లో షేర్ చేసింది.