నందీగ్రామ్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇవాళ నందీగ్రామ్లో ర్యాలీ తీశారు. వీల్చైర్ నుంచే ఆమె పాదయాత్ర ప్రచారం నిర్వహించారు. భారీ జనంతో దీదీ ర్యాలీలో పాల్గొన్నారు. నందీగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. నగరంలోని కుదీరామ్ మోర్ నుంచి ఠాకూర్ చౌక్ వరకు ఆమె పాదయాత్ర నిర్వహించారు. మార్చి 28వ తేదీ నుంచి నందీగ్రామ్లోనే అయిదు రోజుల పాటు గడపనున్నట్లు నిన్న దీదీ తెలిపారు. బీజేపీ గుండాలు నందీగ్రామ్లో పాగా వేశారని, వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఆమె అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని తృణమూల్ నేతలు ఆదివారం ఈసీని కోరారు. ఏప్రిల్ ఒకటో తేదీన జరగనున్న రెండవ దశ పోలింగ్లో నందీగ్రామ్లో ఎన్నికలు జరగనున్నాయి.