నిర్మల్ అర్బన్, మే 11 : ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి 100 శా తం వ్యాక్సిన్ను ఇప్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు నిర్మల్ డిపో మేనేజర్ ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపోలో రెండో డోస్ వ్యాక్సినేషన్ క్యాంప్ను నిర్వహించా రు. ఆయన క్యాంప్ను ప్రారంభించారు. మొదటి రోజు దాదాపు 100 ఉద్యోగులు, సిబ్బందికి ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇప్పించామని తెలిపారు. డ్రైవర్లు, కండక్టర్లందరికీ మొదటి డోసు పూర్తయిందని, దశల వారీగా రెండో డోస్ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో రమణ, సుజాత తదితరులున్నారు.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
కరోనా వైరస్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి గంగామణి సూచించారు. మంగళవారం ఆమె రెండో డోస్ టీకాను తీసుకున్నారు. అర్హులైన వారు టీకా తీసుకోవాలని, భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు కృషి చేస్తున్న వైద్య సిబ్బంది, అధికారులను ఆమె అభినందించారు.