ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 18: అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన వంశీధర్రెడ్డిని మంత్రి కేటీఆర్ బుధవారం ప్రగతిభవన్లో అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేటకు చెందిన తాడ అరుణ-శ్రీనివాస్రెడ్డి దంపతుల కుమారుడు వంశీధర్రెడ్డి చిన్నప్పటి నుంచి ఖోఖోలో రాణిస్తున్నాడు. గత జూన్లో వరంగల్లో జరిగిన స్టేట్ మీట్లో తెలంగాణ తరుఫున ఆడాడు. జూలై 23 నుంచి 25 వరకు జామ్నగర్లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో సత్తాచాటి భారతజట్టుకు ఎంపికయ్యాడు. ఈనెల 14,15 తేదీల్లో నేపాల్ రాజధాని కాట్మండులో జరిగిన అంతర్జాతీయ ఖోఖో పోటీల్లో భారత జట్టు పసిడి పతకం సాధించింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వంశీ ప్రతిభను స్థానిక నేతలు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం ప్రగతిభవన్కు వంశీని పిలిపించుకుని వెల్డన్ అంటూ మంత్రి అభినందించారు. హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ కాలేజీలో అడ్మిషన్ కోసం ఆయన సిఫారసు చేశారు. ఈ సందర్భంగా వంశీధర్రెడ్డి తల్లిదండ్రులు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.