ఆగకుండా వెళ్తుండగా చేజ్ చేసి పట్టుకున్న మంత్రి
రాజాపూర్, మే 24 : జాతీయ రహదారిపై బైక్ను బొలెరో వాహనంతో ఢీకొట్టి పారిపోతుండగా ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ చేజ్ చేసి పట్టుకున్న ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిన్నవెళ్లి శ్రీనివాస్ బాలానగర్ నుంచి ముదిరెడ్డిపల్లి వస్తుండగా, హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొట్టి వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ నుంచి వస్తున్న మంత్రి శ్రీనివాస్గౌడ్ చూసి వెంటనే తన కాన్వాయ్ సిబ్బందితో వాహనాన్ని దాదాపు మూడు కిలోమీటర్లు మేరకు వెంబడించి మండలకేంద్రం సమీపంలోని బస్టాండ్ వద్ద పట్టుకున్నారు. తన సెక్యూరిటీ సిబ్బందితో వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులను అప్రమత్తం చేసి రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్కు మెరుగైన చిక్సిత కోసం జిల్లా దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి కాచిగూడ సాయి కృష్ణ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.