గిరిజనులకు రెసిడెన్షియల్ న్యాయ కళాశాల
దేశంలోనే తొలిసారి సంగారెడ్డిలో ఏర్పాటు
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల విధానంలో..
నేడు ప్రారంభించనున్న మంత్రులు సత్యవతి, హరీశ్రావు
కళాశాలలో మొత్తం 60 సీట్లు..గిరిజనులకు 36 కేటాయింపు
మిగతా సీట్లు ఇతర వర్గాలతో భర్తీ
ఓయూ అనుబంధంగా ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి
హాస్టల్, గ్రంథాలయం, జిమ్ వంటి సౌకర్యాలు అందుబాటులో..
సంగారెడ్డి, మార్చి 26 : బంగారు తెలంగాణకు బాటలు పడుతున్నాయి.. గిరిజనుల అభివృద్ధిని కోరుతూ సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. ప్రతి ఒక్కరికీ ఉన్నతమైన విద్యనందించేందుకు ఎస్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారిగా గిరిపుత్రులకు న్యాయ విద్యను అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈమేరకు ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెసిడెన్షియల్ న్యాయ కళాశాల ఏర్పాటు చేసింది. ఇప్పటికే తరగతులు ప్రారంభం కాగా, ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో ఐదేండ్ల కోర్సు అందించనున్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతితో కొనసాగుతున్న ఈ కళాశాలలో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు న్యాయశాస్త్ర పట్టా అందజేస్తారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలను నేడు మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్రావు ప్రాంభించనున్నారు. గిరిజన బిడ్డలకు లా విద్య అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల ప్రాం తాల్లో గుడిసెలు వేసుకుని జీవనం సాగించే గిరిపుత్రులకు తెలంగాణ ప్రభుత్వం అన్నింటా అండగా నిలుస్తున్నది. వారు విద్యాపరంగా అభివృద్ధి చెందేందుకు చేయూతనిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంగారెడ్డిలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ‘రెసిడెన్షియల్ న్యాయ కళాశాలను పురుషుల కోసం ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి నుంచి 36మంది విద్యార్థులతో తరగతులను సైతం ప్రారంభించింది. పాఠ్యాంశాల బోధనకు డైరెక్టర్తో సహా ఐదుగురు అధ్యాపక బృందాన్ని నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ సహకారంతో ఐదేండ్ల పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సు ఈ కళాశాలలో అందిస్తారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంది. ఈ కళాశాలలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి బీఏ, ఎల్ఎల్బీ న్యాయశాస్త్ర పట్టాను అందిస్తారు. ఈ కళాశాలలో మొత్తం సీట్లు 60 ఉండగా, లాసెట్ ఆధారంగా సీట్లను ప్రభుత్వం భర్తీ చేసింది.
ఇప్పటికే 36 మంది విద్యార్థులు చేరగా.. వారికి బోధన కొనసాగుతున్నది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని 16వ వార్డులోని (పాత నాగార్జున డిగ్రీ కళాశాల) ప్రైవేట్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలను నేడు మంత్రులు సత్యవతి రాథోడ్, హరీశ్రావు ప్రారంభించనున్నారు. ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కళాశాలలో హాస్టల్, వంటశాల, జిమ్, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కలవు. ప్రభుత్వ ఆధ్వర్యంలో రెసిడెన్సియల్ న్యాయ విద్య అందుబాటులోకి రావడంతో గిరిజన విద్యార్థుల తల్లిదండ్రుల్లో సంతోషం నెలకొంది. మారుమూల గ్రామీణ ప్రాం తాలకు దూరంగా బతుకు జీవనం సాగిస్తున్న గిరిజనులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ న్యాయ కళాశాలతో ఉన్నతమైన విద్య అందనుంది. న్యాయ విద్య పూర్తిచేసి కోర్టుల్లో గిరిజన బిడ్డలు గళం వినిపించే అవకాశం లభించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇందులో విద్య అందించనున్నారు.
కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు..
న్యాయశాస్త్రంలో గిరిజనులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులకు ఐదేండ్ల పాటు కోర్సును పూర్తి ఉచితంగా ప్రభుత్వం అందించనున్నది. హాస్టల్ సౌకర్యం కల్పించనుంది. గిరిజన విద్యార్థులతో పాటు ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు న్యా యశాస్త్ర కళాశాలలో కేటగిరీల వారీగా సీట్లను ప్రభు త్వం కేటాయించింది. కళాశాలలో మొత్తం 60 సీట్లు ఉండగా, అందులో గిరిజనులకు 39, దళితులకు 6, వెనుకబడిన వర్గాల వారికి 7, ఓసీలకు 2, ఎన్సీసీ కేటగిరీకి 2, స్పోర్ట్స్ కోటాలో 2, దివ్యాంగులకు 1, మాజీ సైనిక కుటుంబాలకు 1.. ఇలా మొత్తం 60 మందికి ఏటా కోర్సులో అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నది. ఫిబ్రవరిలో కళాశాల ప్రారంభమైనట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ వీవీ ఖన్నా తెలిపారు.గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురుకుల విధానంలో దీనిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
నేడు ప్రారంభించనున్న మంత్రులు
దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులకు న్యాయ విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన గిరిజన న్యాయ కళాశాలను మం త్రులు హరీశ్రావుతోపాటు సత్యవతి రాథోడ్ శనివారం (నేడు) ప్రారంభించనున్నారు. అందుకు సం బంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల మంత్రులు ఈ నూతన న్యాయ కళాశాలను ప్రారంభించనున్నట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ వీవీ ఖన్నా వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో…
మారుమూల ప్రాంతాలకు చెందిన గిరిజన పేద విద్యార్థులతో పాటు ఇతర వర్గాలకు చెందిన విద్యార్థుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తొలిసారి రెసిడెన్షియల్ న్యాయశాస్త్ర కళాశాలను ప్రభు త్వం ఏర్పాటు చేసింది. గతంలో ఏప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేయలేదు. కానీ, సీఎం కేసీఆర్ గిరిజనులతో పాటు ఇతర కులాలకు న్యాయశాస్త్రంలో పట్టభద్రులుగా తీర్చిదిద్దేందుకు దీనిని ఏర్పాటు చేయడం గొప్ప విష యం. ఇందులో ఐదేండ్ల కోర్సును పూర్తి ఉచితంగానే ప్రభుత్వం అందిస్తుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఉంది. ఓయూ అనుబంధంగా ఈ కళాశాల కొనసాగుతుంది. ఇం దులో అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన సాగుతుంది. 39మంది గిరిజన విద్యార్థులకు అవకాశం ఇచ్చాం. 65 శాతం సీట్లను ప్రభు త్వం వారితో భర్తీ చేయడం గొప్ప విషయం.