MI vs KKR | ఐపీఎల్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్లో కోల్కతా ఘన విజయం సాధించింది. 156 పరుగుల టార్గెట్ ఛేదన లక్ష్యంగా బరిలో దిగిన కోల్కతా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మొదటి ఓవర్ నుంచే పరుగుల వేట మొదలు పెట్టారు. క్వింటన్ డికాక్ (55) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ 30 బంతుల్లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ( 5), ఇషాన్ కిషన్ ( 14 ), కృనాల్ పాండ్య ( 12 ) ఆకట్టుకోలేకపోయారు. పోలార్డ్ 21 పరుగులకే రన్నౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 155 పరుగులకే పరిమితమైంది.
గత మ్యాచ్ విజయంతో ఫామ్లో ఉన్న కోల్కతా ఆటగాళ్లు దూకుడుగా ఛేజింగ్ మొదలుపెట్టారు. శుభ్మన్ గిల్ 13 పరుగులకే ఔటయ్యాడు. అయినప్పటికీ వెంకటేశ్ అయ్యర్ ( 53 ), రాహుల్ త్రిపాఠి(74*) భాగస్వామ్యంలో జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. దీంతో కోల్కతా గెలుపు సునాయసమైంది.