ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి..తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే తాను ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రాలేదంటోంది రకుల్. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న రకుల్..కెరీర్లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి మాట్లాడుతూ..నేను భయంతో జీవించే వ్యక్తిని కాదు. ఎంతోమంది సినిమాలు చేయాలనుకుంటున్న దగ్గర నేను అవకాశం పొందాను.
నేను ఇండస్ట్రీకి వచ్చినపుడు ఏం లేదు. ఎల్లప్పుడూ వెలుగు దిశగా ఆలోచిస్తూ అడుగులు వేశాను. ఫలితంగా అవకాశాలు పొంది..నా కలలో జీవిస్తున్నానని చెప్పుకొచ్చింది రకుల్. తెలుగులో క్రిష్ డైరెక్షన్ లో వైష్ణవ్ తేజ్ హీరోగా కొండపొలం నవలాధారంగా వస్తున్న చిత్రంలో నటిస్తోంది. మరోవైపు అర్జున్ కపూర్ తో ఓ సినిమాతోపాటు పలు చిత్రాలను లైన్ లో పెట్టింది రకుల్.