డాక్టర్ రెడ్డీస్ లాబ్తో కలిసి పైలట్ ఫేజ్
హైదరాబాద్: మే 17(నమస్తే తెలంగాణ): స్పుత్నిక్-వీ టీకాలతో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ లాబ్లు ప్రకటించాయి. అపోలో హాస్పిటళ్లలో పైలట్ ఫేజ్గా నిర్వహిస్తున్న ఈ వ్యాక్సినేషన్ మొదటిదశ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమయ్యిందని, మంగళవారం (మే18)న విశాఖపట్నంలో జరుగుతుందని అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి చెప్పారు. కొవిన్లో రిజిస్ట్రేషన్తో సహా ప్రభుత్వం సిఫార్సుచేసిన నిర్వహణా ప్రమాణాలకు అనుగుణంగా ఈ వ్యాక్సినేషన్లు జరుగుతాయని, నెలరోజుల వ్యవధిలో 10 లక్షల టీకాలు తమకు అందుతాయని ఆమె వివరించారు. హైదరాబాద్, విశాఖపట్నం తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, కొల్కతా, పూణెలకు పైలెట్ ప్రొగ్రామ్ను విస్తరిస్తారు.
స్పుత్నిక్ తయారీకి శిల్పా మెడికేర్ ఒప్పందం
హైదరాబాద్: మే 17: కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీ తయారీకి డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఫార్మా కంపెనీ శిల్పా మెడికేర్ సోమవారం తెలిపింది. తమ సబ్సిడరీ శిల్పా బయోలాజికల్స్కు కర్నాటకలోని దార్వాడ్లో కలిగిన ఉత్పత్తికేంద్రంలో మూడేళ్లపాటు ఈ వ్యాక్సిన్ తయారీ, ఆ కేంద్రం నుంచి సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు కంపెనీ తెలిపింది.