అహ్మదాబాద్: ఐపీఎల్ 2021 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. పంజాబ్ తాత్కాలిక కెప్టె్న్ మయాంక్ అగర్వాల్(99 నాటౌట్: 58 బంతుల్లో 8ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగడంతో పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న డేవిడ్ మలన్(26: 26 బంతుల్లో ఫోర్, సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆవేశ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అగర్వాల్ మూడు ఫోర్లు, సిక్స్ బాది 23 రన్స్ రాబట్టడంతో జట్టు స్కోరు 160 దాటింది. తొలి ఓవర్ నుంచే ఢిల్లీ బౌలర్లు వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెట్టారు. రబాడ ఒక్కడే మూడు వికెట్లు తీయగా అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.