అబుదాబి: టీ20 ప్రపంచకప్ మొదలైనా ఇంకా ఐపీఎల్ను ఆటగాళ్లు మరచిపోవడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ను గుర్తు చేసుకుని విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తరఫున ఆడటం ప్రపంచకప్ టోర్నీకి ఎంతో దోహదం చేసిందని పేర్కొన్నాడు. కోహ్లీ, డివిలియర్స్ గురించి మాట్లాడుతూ..‘ఇద్దరు దిగ్గజాలు ఉన్న జట్టులో ఆడటం తన అదృష్టం. ప్రతిరోజు కొత్త అనుభవం, కొత్త విషయాలు నేర్చుకున్నా. విరాట్, డివిలియర్స్ను నిరంతరం గమనించాను. ఆర్సీబీ తరఫున ఆడేందుకు అవకాశం ఇచ్చిన వారిద్దరికి కృతజ్ఞతలు. వారితో మాట్లాడితే పదడుగుల ఎత్తుకు ఎదిగినట్లు భావిస్తాం. అక్కడ స్వేచ్ఛా వాతావరణం ఉంటుంది’ అని పేర్కొన్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో అత్యధికంగా రూ.14.25 కోట్లు పలికిన మాక్స్వెల్ ఆర్సీబీ తరఫున 15 మ్యాచ్లు ఆడి 513 పరుగులు చేశాడు.