ముంబై: కోల్కతా నైట్రైడర్స్ నిర్దేశించిన 134 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం లభించింది. జోస్ బట్లర్(5) త్వరగానే పెవిలియన్ చేరినా క్రీజులో ఉన్నంతసేపు యశస్వి జైశ్వాల్(22) దూకుడుగా ఆడాడు. పవర్ప్లే ఆఖరికి రాజస్థాన్ 50/2తో నిలిచింది. 7 ఓవర్లకు రాజస్థాన్ 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ సంజూ శాంసన్(15), శివమ్ దూబే(13) క్రీజులో ఉన్నారు. రాయల్స్ విజయానికి ఇంకా 78 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంది.