ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని రాజ్భవన్లో బుధవారం కలిశారు. రవిశాస్త్రి మర్యాదపూర్వకంగానే గవర్నర్ను కలిసినట్లు తెలిసింది. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్, భారత్ మధ్య వన్డే సిరీస్ను విజయవంతంగా నిర్వహించారు. మూడు వన్డేల సిరీస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ను 3-1తో, టీ20 సిరీస్ను 3-2తో కోహ్లీసేన సొంతం చేసుకున్నది.