పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) మధ్య మంగళవారం ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయాన్ని అంతా ఎంజాయ్ చేస్తున్న వేళ.. సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్పై బీసీసీఐ నజర్ పెట్టింది.
మంగళవారం మ్యాచ్ జరుగడానికి ముందు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మన్ దీపక్ హుడా ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటోపై అందరి దృష్టి పడింది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీం హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఫోటో పోస్ట్ చేసి మేం వెళుతున్నాం@ పంజాబ్ కింగ్ ఎస్ఐపీఎల్ # పీబీఎస్వీఎస్ఆర్ఆర్ # ఐపీఎల్ 2021 # సద్దా పంజాబ్ అనే క్యాప్షన్ ట్వీట్ చేశాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టులో ఎవరెవరు ఉంటారు, ఎప్పుడు ఆడతారు అనే విషయాలు బయటపెట్టకూడదు. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) అధిపతి షాబీర్ హుస్సేన్ షేఖదం ఖండ్వావాలా ఈ అంశంపై దృష్టిని కేంద్రీకరించారు.ప్రస్తుతం 2021 ఐపీఎల్ సెకండ్ సీజన్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతున్న సంగతి తెలిసిందే.
సదరు ట్వీట్ అవినీతి నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉందా అనే కోణంలో ఏసీయూ దర్యాప్తు చేపడుతున్నది. గతేడాది యూఏఈలో ఐపీఎల్ టోర్నీ జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఆటగాళ్ల పోస్టులను ఏసీయూ పరిశీలించనున్నది. ఇదిలా ఉంటే దీపక్ హుడా ఇన్స్టాగ్రామ్లో చేసిన ఫోటో పోస్ట్ మిస్ అయింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రెండు బంతులకే డక్ ఔట్ అయ్యాడు. ఈ నెల 25న హైదరాబాద్ సన్రైజర్స్తో షార్జాలో పంజాబ్ కింగ్స్ తల పడనున్నది.