దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్ ఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన మహిళల 51 కిలోల విభాగం ఫైనల్లో కజకిస్థాన్కు చెందిన నాజిమ్ కిజాయిబే చేతిలో మేరీ కోమ్ ఓటమిపాలైంది. దీంతో మేరీ కోమ్ రజత పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ 2-3తో ప్రత్యర్థి చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నమెంట్లో మేరీకిది ఏడో పతకం కాగా 2003లో మొదటిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.