టోక్యో: పారాలింపిక్స్( Tokyo Paralympics )లో ఇండియాకు పతకాల పంట పండుతోంది. మంగళవారం ఉదయం షూటింగ్లో బ్రాంజ్ మెడల్ రాగా.. తాజాగా హైజంప్ టీ63లో మరో రెండు మెడల్స్ వచ్చాయి. ఇండియాకు చెందిన మరియప్పన్ తంగవేలు సిల్వర్ గెలవగా.. ఇదే ఈవెంట్లో శరద్ కుమార్ బ్రాంజ్ గెలుచుకున్నాడు. దీంతో ఇండియా మొత్తం పతకాల సంఖ్య పదికి చేరింది.