టోక్యో: ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత్కు చుక్కెదురయింది. స్టార్ షూటర్లు మను బాకర్, యశస్విని దేస్వాల్ టాప్-8కు అర్హత సాధించలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఇద్దరు నిష్క్రమించారు. మను బాకర్ 12వ స్థానంలో, యశస్విని 13 స్థానంలో నిలిచారు.
టోక్యో ఒలింపిక్స్ పతకాల వేటలో శనివారం భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. మహిళల వెయిట్ లిఫ్టింగ్లో మీరాభాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించింది. ఆదివారం బ్యాడ్మింటన్తోపాటు 12 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడనున్నారు.
ఉదయం 7.45 గంటలకు- మహిళల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఫైనల్
ఉదయం 9.30 గంటలకు- పురుషుల 10 మీ. ఎయిర్ క్వాలిఫికేషన్ మ్యాచ్లు
మధ్యాహ్నం 12 గంటలకు- పురుషుల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్